ముంబయి పవర్ కట్ పై నెటిజన్ల జోకులు... ఆనంద్ మహీంద్రా స్పందన

  • ముంబయిలో ఈ ఉదయం పవర్ కట్
  • విద్యుత్ లైన్లు ట్రిప్ అయ్యాయంటూ మహీంద్రా ట్వీట్
  • కామెడీ లైన్లు మాత్రం చెక్కుచెదరలేదంటూ వ్యాఖ్యలు
ముంబయి మహానగరంలో పవర్ కట్ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. అందుకు కారణం నెటిజన్ల మీమ్స్. ముంబయి విద్యుత్ అంతరాయంపై ఇంటర్నెట్లో జోకులు పేలుతున్నాయి. ఈ ఉదయం విద్యుత్ ప్రసారానికి అంతరాయం ఏర్పడడంతో నగరం స్తంభించిపోయింది. ఎక్కడి కార్యకలాపాలు అక్కడే నిలిచిపోయాయి.

దీనిపై సామాజిక మాధ్యమాల్లో నవ్వు పుట్టించేలా ఉన్న ఓ జిఫ్ పై ప్రఖ్యాత వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు. 'ముంబయి పవర్ లైన్లు ట్రిప్ అయ్యాయి... కామెడీ లైన్లు మాత్రం ఇంటర్నెట్ లో చెక్కుచెదరకుండా నిలిచే ఉన్నాయి... కాంతివేగంతో కదులుతున్నాయవి' అంటూ తనదైన శైలిలో ట్వీట్ చేశారు.


Anand Mahindra
Mumbai Power Cut
Memes
Internent

More Telugu News